ఇంటి నుంచే పనిచేయండి.. 87% సంస్థల నిర్ణయం
- March 30, 2021
కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో చాలా కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చాయి. తాజా పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ని శాశ్వతంగా కొనసాగించేందుకు ఆలోచిస్తున్నాయి. తాజాగా బీసీజీ-జూమ్ నిర్వహించిన సర్వేలో 87 శాతం సంస్థలు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు మొగ్గు చూపినట్లు తేలింది. అంతేకాదు కరోనా కాలంలో ఇంటి నుంచి పని చేసే వాళ్ల సంఖ్య మూడు రెట్లు పెరిగినట్లు ఈ సర్వే స్పష్టం చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కంపెనీలపై పడిన ఆర్థిక ప్రభావం, వీడియో కమ్యూనికేషన్స్ చూపిన పరిష్కారాలపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ)తో కలిసి జూమ్ ఈ సర్వే నిర్వహించింది.
ప్రపంచంలో ఇండియా సహా ఆరు దేశాల్లోని ప్రధాన రంగాలపై వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రభావాన్ని ఈ సర్వే అధ్యయనం చేసింది. ఇండియా, యూఎస్, యూకే, జపాన్, ఫ్రాన్స్, జర్మనీలలో ఈ సర్వే నిర్వహించారు. సర్వే జరిపిన సంస్థలలో వీడియో కాన్ఫరెన్సింగ్ పరిష్కారాలు మూడు నుంచి ఐదు రెట్లు పెరిగినట్లు గుర్తించారు. ఇక సర్వేలో భాగంగా మేనేజర్ స్థాయి ఉద్యోగులను ఇంటర్వ్యూ చేయగా.. అందులో 70 శాతం మంది రిమోట్ వర్కింగ్కు అనుకూలంగా ఓటేశారు. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కంపెనీలకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అయింది. అంతేకాదు.. చాలామంది తమ ఉద్యోగాలు కూడా కాపాడుకోగలిగారు. ఒక్క యూరప్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా 22.8 లక్షలమంది ఉద్యోగాలు నిలిచాయి.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







