ప్రైవేటు సెక్టార్‌కి ఊతమిచ్చేందుకోసం షరీక్ ప్రోగ్రామ్ ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్

- March 31, 2021 , by Maagulf
ప్రైవేటు సెక్టార్‌కి ఊతమిచ్చేందుకోసం షరీక్ ప్రోగ్రామ్ ప్రారంభించిన క్రౌన్ ప్రిన్స్

రియాద్:ప్రైవేటు సెక్టార్‌కి ఊతమిచ్చేందుకోసం షరీక్ (భాగస్వామి) పేరుతో కొత్త కార్యక్రమాన్ని క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ ప్రారంభించారు. 12 ట్రిలియన్ సౌదీ రియాల్స్ (3.2 ట్రలియన్ డాలర్ల) ఇన్వెస్టిమెంట్స్ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. 2030 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు క్రౌన్ ప్రిన్స్. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు సౌదీ అరేబియా స్వర్గధామంగా మారనుందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. స్థిరమైన ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపడ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా 5 ట్రలియన్ సౌదీ రియాల్స్ ఇన్వెస్ట్ చేసేలా ప్రైవేటు కంపెనీలను ప్రోత్సహించనుంది ప్రభుత్వం. పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ 3 ట్రలియన్ సౌదీ రియాల్స్ వరకు పెంచనున్నారు. నేషనల్ ఇన్వెస్టిమెంట్ స్ట్రేటజీలో భాగంగా 4 ట్రలియన్ సౌదీ రియాల్స్ కేటాయింపుకి పైన ఫేర్కొన్న 3 ట్రలియన్ సౌదీ రియాల్స్ అదనం. వందలాది, వేలాది ఉద్యోగావకాశాలు ఈ కార్యక్రమం ద్వారా లభిస్తాయి. ప్రస్తుతం వున్న 18వ స్థానం నుంచి 15వ స్థానాకి చేరుకోవడమే లక్ష్యంగా సౌదీ అరేబియా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com