పబ్లిక్ ఉద్యోగాలు కేవలం సిటిజెన్స్కి మాత్రమే: ఎంపీలు
- February 29, 2016వలసదారులెవరూ ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం దక్కించుకోలేరని ఎంపీలు స్పష్టం చేశారు. పబ్లిక్ సెక్టార్లో బహ్రెయినీలకు మరిన్ని ఉద్యోగాలు కల్పించే దిశగా ఓ ప్రపోజల్ని ఎంపీ జమీలా అల్ సమ్మక్ మరియు మరో నలుగురు ఎంపీలు అందజేశారు. నెల రోజుల క్రితమే ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తున్న 50 శాతం మంది నాన్ బహ్రెయినీలకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకోగా, దాని తర్వాత బహ్రెయినీ పౌరుల కోసం తీసుకున్న తాజా చర్యగా దీనిని అభివర్ణించవచ్చు. బహ్రెయినీలకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగావకాశాల్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలో ఇది కూడా ఓ భాగమని ఎంపీలు చెప్పారు. గడచిన మూడేళ్ళలో సుమారు 2500 మంది వలసదారులు బహ్రెయిన్ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు పొందారు. వారందర్నీ వెనక్కి పంపి, వారి స్థాయిలో బహ్రెయినీలకు అవకాశం కల్పించాల్సి ఉందని ఎంపీ ఖాదీమ్ చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే నాన్ బహ్రెయినీలకు అవకాశం కల్పించాలని నిబంధనలు చెబుతున్నాయి. ఓ ఉద్యోగానికి బహ్రెయినీ యువకులెవరూ పోటీ లేనప్పుడే వలసదారులకు అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..