మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- April 04, 2021
ముంబై:రాష్ట్రంలో కోవిడ్ -19 యొక్క భయంకరమైన వ్యాప్తిని అరికట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కఠినమైన కొత్త ఆంక్షలను ప్రకటించింది.ప్రతి శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు వారాంతపు లాక్ డౌన్ అలానే ప్రతి రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు.గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు బాగా పెరిగిన నేపథ్యంలో ఈ ఉత్తర్వు వచ్చింది. శనివారం రాష్ట్రంలో 49,447 తాజా కేసులు, 277 మరణాలు నమోదయ్యాయి.COVID-19 కేసుల పెరుగుదలను పరిమితం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం మీద చర్చించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆదివారం రాష్ట్రానికి చెందిన బిజినెస్ మ్యాన్ బృందాన్ని కలిశారు. సీఎం మరియు పారిశ్రామికవేత్తల మధ్య మధ్యాహ్నం జరిగిన వర్చువల్ సమావేశానికి పరిశ్రమ లాబీ సిఐఐ జాతీయ అధ్యక్షుడు, బ్యాంకర్ ఉదయ్ కోటక్ నాయకత్వం వహించినట్లు అధికారులు తెలిపారు.మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్ విధించినట్లయితే ప్రజలకు కష్టాలు ఎదురవుతాయని పరిశ్రమల నాయకులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







