కరోనా కేసులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన BCCI...
- April 04, 2021ముంబై:కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ఐపిఎల్ నిర్వహణపై సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబైలో కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో వాంఖడే స్టేడియంలో నిర్వహించతలపెట్టిన మ్యాచ్లన్నీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోపక్క ఒక్కొక్కరుగా ఐపిఎల్ క్రీడాకారులు కరోనా బారిన పడుతున్నారు.ముంబై, చెన్నై, ఆర్సిబి, ఢిల్లీ జట్లలో కొందరు ఆటగాళ్లు, సిబ్బంది కరోనాకు గురయ్యారు.దీంతో ఆందోళన నెలకొంది.ఈ క్రమంలోనే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తాజాగా బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. టోర్నమెంట్ నిమిత్తం కేవలం ఆరు వేదికలనే ఎంపిక చేశామని, బయో బబుల్లో మ్యాచ్లు జరగనున్నాయని తెలిపారు. ప్రేక్షకులు లేకుండానే టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఆటగాళ్లకు వ్యాక్సినేషన్పై కేంద్రంతో చర్చిస్తామని చెప్పారు. వ్యాక్సినేషన్ వారికి అవసరమని తెలిపారు. ఆటగాళ్లకు కరోనా సోకడంతో టోర్నమెంట్ నిర్వహణపై ఆలోచిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్