ఇండియన్‌ వర్కర్స్‌ని హైర్‌ చేసుకోవడానికి కొత్త విధానం

- May 31, 2015 , by Maagulf
ఇండియన్‌ వర్కర్స్‌ని హైర్‌ చేసుకోవడానికి కొత్త విధానం

కంపెనీలు భారతదేశం నుంచి వర్కర్లను హైర్‌ చేసుకోవడానికి ఇండియన్‌ గవర్నమెంట్‌ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చినట్లు యూఏఈలోని భారత అంబాసిడర్‌ టి.పి. సీతారామన్‌ చెప్పారు. బ్లూ కాలర్‌ వర్కర్స్‌ మరియు, నర్స్‌లను హైర్‌ చేసుకోవాలనుకునేవారు కొత్త రూల్స్‌కి అనుగుణంగా వ్యవహరించాలని ఆయన వెల్లడించారు.ఇమిగ్రెట్ అనే విధానం ద్వారా ఇకపై ‘హైర్‌’ చేసుకోవాల్సి ఉంటుంది.www.emigrate.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా ఇండియన్‌ మిషన్స్‌ నుంచి పర్మిట్‌ పొందవచ్చు.తద్వారా లభించే రిజిస్ట్రేషన్స్‌ ద్వారా ఇండియన్‌ వర్కర్స్‌ని రిక్రూట్‌ చేసుకోవచ్చు.యూఏఈలో పనిచేస్తున్న వారిలో 45 శాతం మంది ఈ నిబంధనల పరిధిలోకి వస్తారని సీతారామన్‌ చెప్పారు.ఎలాంటి అక్రమాలకూ అవకాశం ఇవ్వకుండా పారదర్శకంగా నియామకాలు జరిగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారాయన.

 

--సి.శ్రీ(దుబాయ్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com