పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కేంద్రం
- April 12, 2021
దోహా: ఏప్రిల్ 12న పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభమువుతోంది. మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ హనన్ మొహమ్మద్ అల్ కువారి దోహా పారిశ్రామిక ప్రాంతంలోని ఈ కేంద్రాన్ని సందర్శించారు.ఇంతకు ముందున్న మెడికల్ కమిషన్ ఫెసిలిటీ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు.మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హమాద్ మెడికల్ కార్పొరేషన్, ఖతార్ ఛారిటీ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తాయి.మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ, కొనొకో ఫిలిప్స్ - ఖతార్ సహకారమందిస్తాయి. ఈ కేంద్రం ద్వారా కోవిడ్ 19పై పోరులో మరో కీలకమైన ముందడుగు వేసినట్లవుతుందని అథారిటీస్ పేర్కొన్నాయి. మొత్తం 35 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఇప్పటికే ఖతార్ లో అందుబాటులో వున్నాయి. ఇప్పటిదాకా 1,079,000 మందికి వ్యాక్సిన్లను అందించారు. కాగా, కొత్త వ్యాక్సినేషన్ కేంద్రం వారంలో ఆరు రోజులపాటు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో వుంటుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







