పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కేంద్రం

- April 12, 2021 , by Maagulf
పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కేంద్రం

దోహా: ఏప్రిల్ 12న పారిశ్రామిక ప్రాంతంలో కొత్త కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభమువుతోంది. మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ హనన్ మొహమ్మద్ అల్ కువారి దోహా పారిశ్రామిక ప్రాంతంలోని ఈ కేంద్రాన్ని సందర్శించారు.ఇంతకు ముందున్న మెడికల్ కమిషన్ ఫెసిలిటీ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు.మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హమాద్ మెడికల్ కార్పొరేషన్, ఖతార్ ఛారిటీ సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తాయి.మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ మరియు ఇండస్ట్రీ, కొనొకో ఫిలిప్స్ - ఖతార్ సహకారమందిస్తాయి. ఈ కేంద్రం ద్వారా కోవిడ్ 19పై పోరులో మరో కీలకమైన ముందడుగు వేసినట్లవుతుందని అథారిటీస్ పేర్కొన్నాయి. మొత్తం 35 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఇప్పటికే ఖతార్ లో అందుబాటులో వున్నాయి. ఇప్పటిదాకా 1,079,000 మందికి వ్యాక్సిన్లను అందించారు. కాగా, కొత్త వ్యాక్సినేషన్ కేంద్రం వారంలో ఆరు రోజులపాటు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com