ఎలక్ట్రానిక్ ఎడ్యుకేషన్ వేదికల విజయవంతం
- April 14, 2021
బహ్రెయిన్: కరోనా పాండమిక్ సమయంలో వర్చువల్ క్లాస్ రూములు, ఎడ్యుకేషనల్ పోర్టల్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ క్రమంలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ చేపట్టిన అనేక కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చినట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. మినిస్టర్ డాక్టర్ మాజిద్ బిన్ అలీ అల నుయైమి మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు రిమోట్ లెసన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. 2020-21 విద్యా సంవత్సరానికిగాను 28646 నేరుగా పాఠాలు ఆయా విద్యార్థులకు లాభం చేకూర్చాయి. ఇంటలెక్చువల్ డిజేబిలిటీ మరియు డౌన సిండ్రడోమ్ విద్యార్థులకు 5,736 పాఠాలు, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వున్న విద్యార్థులకు 10,416, లెర్నింగ్ డిఫికల్టీస్ విద్యార్థులకు 10,683, స్పీచ్ మరియు లాంగ్వేజ్ సమస్యలున్నవారికి 1,631 పాఠాలు చెప్పడం జరిగింది. అను నిత్యం, ప్రత్యేకావసరాలు గల విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకోసం వారి తల్లిదండ్రులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మినిస్టర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?
- కువైట్ ఎయిర్పోర్ట్ T5 నుండి డైరెక్ట్ ఫ్లైట్స్.. జజీరా ఎయిర్వేస్
- ఖతార్ లో కమ్యూనిటీ రన్నింగ్ సెషన్లు ప్రారంభం..!!
- సంస్కరణల దిశగా రిమోట్ వర్క్.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆమోదం..!!
- సాక్ష్యంగా ఈమెయిల్.. BHD11,000 దావా కొట్టివేత..!!









