ఎలక్ట్రానిక్ ఎడ్యుకేషన్ వేదికల విజయవంతం
- April 14, 2021
బహ్రెయిన్: కరోనా పాండమిక్ సమయంలో వర్చువల్ క్లాస్ రూములు, ఎడ్యుకేషనల్ పోర్టల్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఈ క్రమంలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ చేపట్టిన అనేక కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చినట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. మినిస్టర్ డాక్టర్ మాజిద్ బిన్ అలీ అల నుయైమి మాట్లాడుతూ, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు రిమోట్ లెసన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. 2020-21 విద్యా సంవత్సరానికిగాను 28646 నేరుగా పాఠాలు ఆయా విద్యార్థులకు లాభం చేకూర్చాయి. ఇంటలెక్చువల్ డిజేబిలిటీ మరియు డౌన సిండ్రడోమ్ విద్యార్థులకు 5,736 పాఠాలు, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వున్న విద్యార్థులకు 10,416, లెర్నింగ్ డిఫికల్టీస్ విద్యార్థులకు 10,683, స్పీచ్ మరియు లాంగ్వేజ్ సమస్యలున్నవారికి 1,631 పాఠాలు చెప్పడం జరిగింది. అను నిత్యం, ప్రత్యేకావసరాలు గల విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకోసం వారి తల్లిదండ్రులకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు మినిస్టర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







