మసీదుల్లో తరావీహ్ ప్రార్థనలకు పరిమితి

- April 14, 2021 , by Maagulf
మసీదుల్లో తరావీహ్ ప్రార్థనలకు పరిమితి

కువైట్ సిటీ: కువైట్ ప్రభుత్వం తరావీహ్ ప్రార్థనల కోసం మసీదుల్లోకి పురుషులకు అనుమతినిస్తోంది పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో. అయితే, తరావీహ్ ప్రార్థనల కోసం 15 నిమిషాల సమయాన్ని మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తోంది. కాగా, కువైట్ జనాభా మొత్తం 4.7 మిలియన్లు కాగా, ఇప్పటివరకు 248,729 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,412 మంది ప్రాణాలు కోల్పోయారు కరోనా కారణంగా. ఇషా (సాయంత్రం) ప్రార్థనల తర్వాత తరావీహ్ కోసం రోజుకి 15 నిమిషాల సమయం మాత్రమే కేటాయిస్తూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి ప్రార్థన తర్వాత మసీదులు మూసివేయడం జరుగుతుది. మసీదులు మరియు బహిరంగ ప్రాంతాల్లో ఇఫ్తార్, సుహుర్ వంటివాటిని బ్యాన్ చేయడం జరిగింది. జనం గుమికూడకుండా ఛారిటీ కార్యక్రమాలకు మాత్రం అనుమతినిచ్చారు. కాగా, ఏప్రిల్ 22 వరకు నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ కువైట్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుఝామున 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమల్లో వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com