తెలంగాణలో లాక్ డౌన్ పై క్లారిటీ..
- April 16, 2021
తెలంగాణ: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ఈటల ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేయమని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కోరడం జరిగిందని..వారు సానుకూలంగా స్పందించారు కానీ హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు.ఆక్సిజన్ కొరత ఉన్న మాట వాస్తవమే ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం..సెకండ్ వేవ్ కరోనా గతంలో కంటే వేగంగా విస్తరిస్తోందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ వరి ధాన్యం కొనుగోలులో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని కోరుతున్నానని తెలిపారు. హైదరాబాదులో వ్యాక్సిన్ తయారవుతుంది కాబట్టి తెలంగాణకు మిగతా రాష్ట్రాల కంటే వ్యాక్సిన్ కేటాయించడం ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరామని వెల్లడించారు.తెలంగాణలో కర్ఫ్యూ 144 సెక్షన్ లాక్ డౌన్ విధించే ఆస్కారం ఉండదని.. ప్రజలే అవసరం ఉంటే తప్ప బయటికి రాకూడదని కోరుతున్నామని తెలిపారు. దేశంలో లో రెండు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి.. మన తెలంగాణలో నాలుగు వేల కేసులు నమోదవుతున్నాయన్నారు.హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా నీళ్లు అందించామని..రైతాంగం క్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









