కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు

- April 17, 2021 , by Maagulf
కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు

ఒమన్: కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకుగాను అవసరమైతే మరింత కఠిన చర్యలకు వెనుకాడకూడదని ఒమన్ అథారిటీస్ భావిస్తున్నాయి. దోఫార్ గవర్నరేట్ పరిధిలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సుప్రీం కమిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, పూర్తి లాక్ డౌన్ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు దోఫార్ గవర్నరేట్ పరిధిలో వ్యాపార కార్యకలాపాల్ని సస్పెండ్ చేస్తున్నామనీ, ఏప్రిల్ 17 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని అథారిటీస్ పేర్కొన్నాయి. ప్రతి ఒక్కరూ ఫేస్ మాస్కులు ధరించాలనీ, ఎక్కముంది గుమికూడకూడదనీ, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకుంటూ వుండాలని అధికారులు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com