భారత్ లో కరోనా విజృంభణ
- April 19, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా రోజు రోజుకి విజృంభిస్తోంది.తొలి వేవ్ భయపెడితే.. సెకండ్ వేవ్లో భయం తగ్గినా.. కేసులు మాత్రం డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి.ఇప్పటికే రెండు లక్షల మార్క్ను దాటేసిన రోజువారీ కేసులు.. ఇప్పుడు మూడు లక్షల వైపు పరుగులు తీస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 2,73,810 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.1,619 మంది కరోనా బాధితులు మృతిచెందారు.ఇదే సమయంలో 1,44,178 మంది కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారని కేంద్రం పేర్కొంది.. దీంతో.. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,50,61,919కు చేరుకోగా.. యాక్టివ్ కేసులు 19,29,329గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 1,29,53,821 మంది రికవరీ అయితే.. 1,78,769 మంది ప్రాణాలు కోల్పోయారు.మరోవైపు.. ఇప్పటి వరకు 12,38,52,566 మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు కేంద్రం ప్రకటించింది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









