భారత్ లో కరోనా విజృంభణ
- April 19, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా రోజు రోజుకి విజృంభిస్తోంది.తొలి వేవ్ భయపెడితే.. సెకండ్ వేవ్లో భయం తగ్గినా.. కేసులు మాత్రం డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి.కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి.ఇప్పటికే రెండు లక్షల మార్క్ను దాటేసిన రోజువారీ కేసులు.. ఇప్పుడు మూడు లక్షల వైపు పరుగులు తీస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 2,73,810 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.1,619 మంది కరోనా బాధితులు మృతిచెందారు.ఇదే సమయంలో 1,44,178 మంది కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్నారని కేంద్రం పేర్కొంది.. దీంతో.. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 1,50,61,919కు చేరుకోగా.. యాక్టివ్ కేసులు 19,29,329గా ఉన్నాయి.. ఇక, ఇప్పటి వరకు 1,29,53,821 మంది రికవరీ అయితే.. 1,78,769 మంది ప్రాణాలు కోల్పోయారు.మరోవైపు.. ఇప్పటి వరకు 12,38,52,566 మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు కేంద్రం ప్రకటించింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







