రమదాన్ నేపథ్యంలో ఫుడ్, షిషా నిబంధనలపై స్పష్టతనిచ్చిన దుబాయ్
- April 20, 2021దుబాయ్: పవిత్ర రమదాన్ మాసంలో ఫాస్టింగ్ సమయాల్లో బహిరంగంగా షిషా, ఫుడ్ విక్రయాలు జరపకూడదని రెస్టారెంట్లు అలాగే షిషా నిర్వాహకులకు స్పష్టం చేశాయి అథారిటీస్. అయితే, వినియోగదారులకు ఫుడ్ డెలివరీస్ మాత్రం చేయవచ్చు. ఔట్ డోర్ ఏరియాస్ విషయానికొస్తే, ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సి వుంటుంది. ఉపవాస సమయాల్లో వీటిని నిర్వహించకూడదు. ఉదయం 4.20 నిమిషాల నుంచి సాయంత్రం 6.45 నిమిషాల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఫుడ్, షిషా వంటివాటికి అనుమతి లేదు. రెస్టారెంట్లు వినియోగదారులకు ఫుడ్ సర్వింగ్ కోసం ప్రత్యేకంగా అనుమతులు అవసరం లేదని దుబాయ్ ఎకానమీ ఇటీవలి సర్క్యులర్ ద్వారా పేర్కొనడం జరిగింది. ఉపవాస సమయాల్లో రెస్టారెంట్లు స్క్రీన్లు వినియోగించాల్సిన అవసరం లేదని కూడా పేర్కొన్నారు. గతంలో, స్క్రీన్లు వినియోగించడం తప్పనిసరి. అటువైపుగా వెళ్ళేవారికి ఇది ఇబ్బందికరంగా మారకూడదనే కోణంలో గతంలో స్క్రీన్ల వినియోగాన్ని తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు