రమదాన్ నేపథ్యంలో ఫుడ్, షిషా నిబంధనలపై స్పష్టతనిచ్చిన దుబాయ్
- April 20, 2021దుబాయ్: పవిత్ర రమదాన్ మాసంలో ఫాస్టింగ్ సమయాల్లో బహిరంగంగా షిషా, ఫుడ్ విక్రయాలు జరపకూడదని రెస్టారెంట్లు అలాగే షిషా నిర్వాహకులకు స్పష్టం చేశాయి అథారిటీస్. అయితే, వినియోగదారులకు ఫుడ్ డెలివరీస్ మాత్రం చేయవచ్చు. ఔట్ డోర్ ఏరియాస్ విషయానికొస్తే, ఖచ్చితంగా నిబంధనలు పాటించాల్సి వుంటుంది. ఉపవాస సమయాల్లో వీటిని నిర్వహించకూడదు. ఉదయం 4.20 నిమిషాల నుంచి సాయంత్రం 6.45 నిమిషాల వరకు బహిరంగ ప్రదేశాల్లో ఫుడ్, షిషా వంటివాటికి అనుమతి లేదు. రెస్టారెంట్లు వినియోగదారులకు ఫుడ్ సర్వింగ్ కోసం ప్రత్యేకంగా అనుమతులు అవసరం లేదని దుబాయ్ ఎకానమీ ఇటీవలి సర్క్యులర్ ద్వారా పేర్కొనడం జరిగింది. ఉపవాస సమయాల్లో రెస్టారెంట్లు స్క్రీన్లు వినియోగించాల్సిన అవసరం లేదని కూడా పేర్కొన్నారు. గతంలో, స్క్రీన్లు వినియోగించడం తప్పనిసరి. అటువైపుగా వెళ్ళేవారికి ఇది ఇబ్బందికరంగా మారకూడదనే కోణంలో గతంలో స్క్రీన్ల వినియోగాన్ని తప్పనిసరి చేశారు.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!