పూర్తి లాక్ డౌన్ దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం
- April 20, 2021ముంబై: భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి.మహారాష్ట్రలో రోజుకు 60 వేల నుంచి 70 వేల కొత్త కరోనా కేసులు నమోదవడం అక్కడి వారికి భయాందోళనకు గురిచేస్తోంది. కరోనా కల్లోలం అరికట్టాలంటే.. లాక్ డౌన్ తప్పనిసరి అని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అభిప్రాయపడ్డారు.అజిత్ పవార్ రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం నియమ నిబంధనలు మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం చాలా మంది అత్యవసర సేవల్లో పాల్గొంటున్నారు. ఈ సంఖ్యను తగ్గించాలని అజిత్ పవార్ సూచించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కఠినమైన ఆంక్షలు విధించినప్పటికీ, కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడటం లేదు. దీంతో అత్యవసర సేవల జాబితాలో ఉన్న కిరాణా దుకాణాలు తెరవడానికి ఇచ్చిన సమయాన్ని తగ్గించే యోచనలో ఉంది. ఏప్రిల్ 21 న రాత్రి 8 గంటల నుంచి మొత్తం లాక్ డౌన్ విధించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అందరు మంత్రులు ఒక అభ్యర్థనను సమర్పించినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు. రేపు రాత్రి 8 గంటల నుండి రాష్ట్రంలో పూర్తి లాక్ డౌన్ ప్రకటించాలని మేము సిఎంను అభ్యర్థించాము. ఇది మంత్రులందరూ సిఎంకు చేసిన అభ్యర్థన, ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తోపే చెప్పారు.
తాజా వార్తలు
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు