లాక్డౌన్ పై క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోదీ
- April 20, 2021
న్యూ ఢిల్లీ: కరోనా రెండో వేవ్ విరుచుకుపడుతోన్న సమయంలో జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కరోనా రెండో వేవ్ లో ఎదుర్కుంటున్న అనేక సమస్యలపై ఆయన మాట్లాడారు.మనం ఇపుడు కరోనా రెండో వేవ్ ఎదుర్కొంటున్నాము. మీరు అనుభవిస్తున్న బాధను నేను అర్థం చేసుకున్నాను. లాక్ డౌన్ లను చివరి అస్త్రంగా మాత్రమే చూడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను..అని ప్రధాని మోదీ అన్నారు. దేశాన్ని లాక్డౌన్ నుంచి కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధపడాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. ధైర్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలమని చెప్పారు. అంతకు మందు అయన మాట్లాడుతూ దేశం నలుమూలలా ఆక్సిజన్ కొరత ఉందని మోదీ అన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి సరఫరా కోసం అనేక చర్యలు తీసుకున్నామని, అనేక ప్లాంట్లు నెలకొల్పామని గుర్తు చేశారు. వైద్య అవసరాల కోసం ఔషధాల ఉత్పత్తి పెంచామని , ఫార్మా పరిశ్రమలు త్వరిత గతిన మెరుగైన వ్యాక్సిన్లు అందిస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టామని చెప్పిన ప్రధాని మోదీ ఫ్రంట్లైన్ వారియర్స్, వయోవృద్ధులకు టీకాలు వేశామన్నారు.అందరూ జాగ్రత్తగా ఉండాలని మోదీ ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







