'వరుడు కావలెను' పోస్టర్ విడుదల
- April 21, 2021హైదరాబాద్: యంగ్ హీరో నాగశౌర్య, రీతువర్మ జంటగా నటిస్తున్న సినిమా 'వరుడు కావలెను'. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీతో లక్ష్మీసౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఇంతవరకూ వచ్చిన ఈ మూవీ ప్రచార చిత్రాలకు, లిరికల్ వీడియోకు చక్కని ఆదరణ లభించింది. తాజాగా శ్రీరామ నవమిని పురస్కరించుని, సీతారాముల చెంత నాగశౌర్య కూర్చొని ఉన్న పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. హీరో నాగశౌర్య సైతం ఈ పోస్టర్ ను ట్వీట్ చేస్తూ తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. నాగశౌర్య నటించిన 'లక్ష్య' మూవీ విడుదలకు సిద్ధంగా ఉండగా, 'వరుడు కావలెను' పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. మరో రెండు మూడు సినిమాలు సైతం అండర్ ప్రొడక్షన్ లో వివిధ దశల్లో ఉన్నాయి. 'వరుడు కావలెను' సినిమా కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు... వాటిలోని భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర దర్శకనిర్మాతలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?