కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: నాలుగు రెస్టారెంట్ల మూసివేత
- April 21, 2021బహ్రెయిన్: నాలుగు టూరిస్టిక్ రెస్టారెంట్లను కరోనా నిబంధనలు పాటించని కారణంగా వారం రోజులపాటు మూసివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. క్యాపిటల్ గవర్నరేట్ పరిధిలో ఈ రెస్టారెంట్లు వున్నాయి. బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ, హెల్త్ మినిస్ట్రీ - పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ అలాగే ఇన్స్పెక్షన్ డైరెక్టరేట్ - మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ, కామర్స్ అండ్ టూరిజం.. సంయుక్తంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. టూరిజం ఔట్ లెట్లు తప్పనిసరిగా కరోనా నిబంధనలు, ప్రికాషన్స్ పాటించాలని ఈ సందర్భంగా బిటిఇఎ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..