కర్ణాటక కరోనా అప్డేట్
- April 21, 2021బెంగుళూరు: కర్ణాటక పై కరోనా సెకండ్ వేవ్ పంజా విజృంభిస్తోంది.కరోనా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి.. ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 23,558 కొత్త కేసులను నమోదు అయ్యాయి.. కర్ణాటకలో ఒకేరోజు ఇంత భారీస్థాయిలో కొత్త కేసులు వెలుగు చూడడం ఇదే తొలిసారి.. కోవిడ్ బారిన పడి 116 మంది మృతిచెందగా.. ఇదే సమయంలో 6,412 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 12,22,202కు చేరుకోగా.. ఇప్పటి వరకు 13,762 మంది మృతిచెందారు.. 1,76,188 మంది రికవరీ అయ్యారు.. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ప్రస్తుతం 15.47 శాతంగా ఉంది.. ఈ రోజు నమోదు అయిన కొత్త కేసుల్లో 13,640 రాజధాని బెంగళూరులోనే నిర్ధారణ కాగా.. 70 మంది అక్కడే మృతిచెందారు. ఇక, కరోనాకు బ్రేక్లు వేసేందుకు కర్ణాటకలో రాత్రులు మరియు వారాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్