కోవిడ్ నిబంధనలు పాటించని 300 మందిపై కేసులు
- April 23, 2021ఖతార్: సెకండ్ వేవ్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ ను అరికట్టేందుకు చర్యలను మరింత ముమ్మరం చేస్తోంది ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ. మాస్కులు పెట్టుకోకున్నా, భౌతిక దూరం పాటించకున్నా, వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణం చేసినా కేసులు నమోదు చేస్తోంది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా 381 మందిపై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసినట్లు మినిస్ట్రి కార్యాలయం వెల్లడించింది. ఇందులో 322 మంది మాస్కులు పెట్టుకోలేదని, 56 మంది భౌతిక దూరం పాటించలేదని వివరించింది. మిగిలిన వాళ్లు వాహనాల్లో పరిమితి మించి ప్రయాణం చేయటం వల్ల కేసులు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించామని వెల్లడించింది. కోవిడ్ నిబంధనలను అమలు చేసేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు వేల కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం..
- కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్టార్ క్యాంపెయినర్గా కీలక బాధ్యతలు
- అయోధ్యలోని బాల రాముడి నుదుటిపై తిలకం దిద్దిన సూర్య భగవానుడు
- భారీ వర్షాలు..ఎమిరేట్స్ ప్రయాణికులకు చెక్-ఇన్ నిలిపివేత
- ఒమన్లో భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం
- తూర్పు ప్రావిన్స్లో భారీ వర్షం.. రియాద్లో అలెర్ట్ జారీ
- భారీ వర్షాలతో విద్యుత్, ఇంటర్నెట్,మంచినీటి సమస్యలు..!
- దుబాయ్ లో మెట్రో సేవలకు అంతరాయం
- సాల్మియాలో ఇద్దరు ప్రవాసులు అరెస్ట్
- భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం..