కోవిడ్ నిబంధనలు పాటించని 300 మందిపై కేసులు
- April 23, 2021ఖతార్: సెకండ్ వేవ్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ ను అరికట్టేందుకు చర్యలను మరింత ముమ్మరం చేస్తోంది ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ. మాస్కులు పెట్టుకోకున్నా, భౌతిక దూరం పాటించకున్నా, వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణం చేసినా కేసులు నమోదు చేస్తోంది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా 381 మందిపై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసినట్లు మినిస్ట్రి కార్యాలయం వెల్లడించింది. ఇందులో 322 మంది మాస్కులు పెట్టుకోలేదని, 56 మంది భౌతిక దూరం పాటించలేదని వివరించింది. మిగిలిన వాళ్లు వాహనాల్లో పరిమితి మించి ప్రయాణం చేయటం వల్ల కేసులు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించామని వెల్లడించింది. కోవిడ్ నిబంధనలను అమలు చేసేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు వేల కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి