కోవిడ్ నిబంధనలు పాటించని 300 మందిపై కేసులు
- April 23, 2021ఖతార్: సెకండ్ వేవ్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ ను అరికట్టేందుకు చర్యలను మరింత ముమ్మరం చేస్తోంది ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ. మాస్కులు పెట్టుకోకున్నా, భౌతిక దూరం పాటించకున్నా, వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణం చేసినా కేసులు నమోదు చేస్తోంది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా 381 మందిపై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసినట్లు మినిస్ట్రి కార్యాలయం వెల్లడించింది. ఇందులో 322 మంది మాస్కులు పెట్టుకోలేదని, 56 మంది భౌతిక దూరం పాటించలేదని వివరించింది. మిగిలిన వాళ్లు వాహనాల్లో పరిమితి మించి ప్రయాణం చేయటం వల్ల కేసులు నమోదు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించామని వెల్లడించింది. కోవిడ్ నిబంధనలను అమలు చేసేందుకు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు వేల కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!