ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
- April 23, 2021
అమరావతి: ఏపీలో కూడా కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.రోజురోజుకు కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.రోజువారి పాజిటివ్ కేసులు పది వేలలు దాటిపోయాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 45,581 శాంపిల్స్ పరీక్షించగా 11,766 మందికి కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 24 గంటల్లోనే కోవిడ్తో 36 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది.. కోవిడ్ బారిన పడి కోవిడ్ వల్ల నెల్లూరు లో ఆరుగురు, చిత్తూర్ లో ఐదుగురు, తూర్పు గోదావరి లో నలుగురు, కృష్ణ లో నలుగురు, కర్నూల్ లో నలుగురు, ప్రకాశం లో నలుగురు, శ్రీకాకుళంలో నలుగురు, విశాఖపట్నం లో ముగ్గురు, గుంటూరు మరియు విజయనగరం లలో ఇద్దరు చొప్పున మరణించారు.ఇదే సమయంలో 4,441 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1009228కు చేరగా.. యాక్టివ్ కేసులు 74,231 గా ఉన్నాయి.ఇక, ఇప్పటి వరకు 927418 కరోనా నుంచి కోలుకోగా 7,579 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం...
- ఇరాన్ సంచలన నిర్ణయం
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- తెలంగాణలో కొత్త ఎయిర్పోర్టులు..కేంద్రం కీలక ప్రకటన
- IPL ఆటగాళ్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఏవియేషన్ విద్యార్థులకు అంతర్జాతీయ ఇంటర్న్షిప్ అవకాశం
- యూఏఈలో పర్యటించనున్న కేంద్ర మంత్రి జైశంకర్
- సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్హీడ్ మార్టిన్ ఎండీ భేటీ
- కాగజ్నగర్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ప్రమాదం
- అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ..స్వాగతించిన భారత్









