ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య ఇక లేరు..
- April 25, 2021టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు పొట్టి వీరయ్య ఇకలేవరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా ఫణిగిరి. వీరయ్య సతీమణి మల్లిక 2008లోనే మరణించారు. ఈయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1969లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ‘అగ్గివీరుడు’ చిత్రం ద్వారా మరుగుజ్జు నటుడిగా టాలీవుడ్కు పరిచయం అయ్యారు వీరయ్య. అనంతరం దాసరి ప్రోత్సాహంతో 'తాత మనవడు' సినిమాలో కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో కలిపి ఇప్పటి వరకు 500లకు పైగా సినిమాల్లో నటించారు వీరయ్య. తనదైన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అగ్గివీరుడు, తాత మనవడు, రాధమ్మ పెళ్లి, జగన్మోహిని, యుగంధర్, గజదొంగ, గోల నాగమ్మ, అత్తగారి పెత్తనం, టార్జాన్ సుందరి వంటి ఎన్నో చిత్రాల్లో పొట్టి వీరయ్య నటించారు. వీరయ్య మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి
- ఈద్ సందర్భంగా జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి కొత్త టైమింగ్స్
- 202 మంది బెగ్గర్స్ అరెస్ట్.. విజిట్ వీసా హోల్డర్లే అధికం
- కువైట్ సమాచార శాఖ మంత్రితో భారత రాయబారి భేటీ