ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య ఇక లేరు..

- April 25, 2021 , by Maagulf
ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య ఇక లేరు..

టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు పొట్టి వీరయ్య ఇకలేవరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం కన్నుమూశారు. తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. పొట్టి వీరయ్య అసలు పేరు గట్టు వీరయ్య. ఆయన స్వస్థలం సూర్యాపేట జిల్లా ఫణిగిరి. వీరయ్య సతీమణి మల్లిక 2008లోనే మరణించారు. ఈయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1969లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ‘అగ్గివీరుడు’ చిత్రం ద్వారా మరుగుజ్జు నటుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు వీరయ్య. అనంతరం దాసరి ప్రోత్సాహంతో 'తాత మనవడు' సినిమాలో కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో కలిపి ఇప్పటి వరకు 500లకు పైగా సినిమాల్లో నటించారు వీరయ్య. తనదైన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అగ్గివీరుడు, తాత మనవడు, రాధమ్మ పెళ్లి, జగన్మోహిని, యుగంధర్‌, గజదొంగ, గోల నాగమ్మ, అత్తగారి పెత్తనం, టార్జాన్‌ సుందరి వంటి ఎన్నో చిత్రాల్లో పొట్టి వీరయ్య నటించారు. వీరయ్య మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com