సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది..
- March 03, 2016
ముల్హీన్ అన్ డెర్ రుర్ (జర్మనీ): జర్మన్ ఓపెన్ గ్రాండ్ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం దాదాపు ఏకపక్షంగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో ఏడో సీడ్ సింధు 21-9, 21-17 స్కోరుతో మిషెల్లీ లీ (కెనడా)ని చిత్తు చేసింది. గత రెండు మ్యాచ్లలో లీ చేతిలో ఓడిన సింధు ఈ సారి సత్తా చాటింది. ఆరంభంనుంచే దూకుడుగా ఆడిన హైదరాబాద్ షట్లర్, ప్రత్యర్థిపై ఆధిక్యం ప్రదర్శించింది. తొలి గేమ్ను సింధు సునాయాసంగా గెలుచుకోగా, రెండో గేమ్లో మిషెల్లీ కాస్త పోటీనిచ్చింది. ఈ మ్యాచ్ 32 నిమిషాల్లో ముగిసింది.పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ ప్రిక్వార్టర్స్లోకి అడుగు పెట్టాడు.
రెండో రౌండ్ మ్యాచ్లో శ్రీకాంత్ 15-21, 21-6, 21-16తో ఎరిక్ మీజ్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. అయితే మరో ఆటగాడు సమీర్ వర్మ రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. లీ డాంగ్ కీన్ (కొరియా) చేతిలో సమీర్ 21-8, 19-21, 19-21 తేడాతో పరాజయంపాలయ్యాడు. పురుషుల డబుల్స్లో కూడా భారత జోడి మను అత్రి-సుమీత్ రెడ్డి టోర్నీనుంచి నిష్ర్కమించింది. చైనీస్ తైపీ జంట లీ షెగ్ ము-సై చియా సిన్ 21-10, 21-10తో మను-సుమీత్ను చిత్తు చేశారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







