ఏపీలో ఇంటర్‌ పరీక్షలు వాయిదా

- May 02, 2021 , by Maagulf
ఏపీలో ఇంటర్‌ పరీక్షలు వాయిదా

అమరావతి: ఏపీలో ఈనెల 5 నుంచి జరగాల్సిన ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి.హైకోర్టు సూచనల మేరకు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.త్వరలో పరీక్షల తేదీలు ప్రకటిస్తామని పేర్కొంది.

ఇంటర్ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలన్న ఏపీ హైకోర్టు చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

కోవిడ్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలన్నీ కేంద్ర ప్రభుత్వమే తయారు చేసినా కానీ 10వ తరగతి, ఇంటర్‌ పరీక్షలకు సంబంధించి దేశం అంతటికీ వర్తించేలా ఒకేలా నిబంధనలు విధించకపోవటంతో ఈ విషయంలో జాతీయ విధానం అంటూ ఏదీ ప్రకటించకపోవటం వల్ల కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు ఇప్పటికే నిర్వహించేశారని ఆయన తెలిపారు. మరికొన్ని రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారని, మరికొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేసి పాస్‌ సర్టిఫికెట్‌ ఇస్తున్నారని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com