'ప్రాజెక్ట్ Z" సీక్వెల్
- May 07, 2021హైదరాబాద్: యంగ్ హీరో సందీప్ కిషన్ బర్త్ డే నేడు.ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు నిర్మాతలు.ఈ క్రమంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'మాయావన్'కు సీక్వెల్ ను ప్రకటించారు.మేకర్స్. సి. వి. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించగా, జాకీ ష్రాఫ్, డేనియల్ బాలాజీ కీలకపాత్రలు పోషించారు.2017 డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మాయావన్' యావరేజ్ గా నిలిచింది.ఈ చిత్రాన్ని తెలుగులో 'ప్రాజెక్ట్ Z" పేరుతో డబ్ చేశారు. తెలుగులోనూ పెద్దగా స్పందన రాలేదు ఈ చిత్రానికి. తాజాగా 'మాయావన్' చిత్రానికి సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. తమిళంలో 'మాయావన్ రీలోడెడ్' అంటూ సినిమా టైటిల్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. తిరుకుమారన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ చిత్రానికి మొదటి భాగాన్ని తెరకెక్కించిన దర్శకుడు సివి కుమార్ దర్శకత్వం వహించారు.ఈ సీక్వెల్ ను తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు