DRDO అద్భుతం..కోవిడ్కు మందు వచ్చేసింది..అత్యవసర అనుమతి మంజూరు చేసిన డీజీసీఐ
- May 08, 2021కోవిడ్ మహమ్మారిని అరికట్టే క్రమంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కీలకమైన అడుగేసింది. కరోనా వైరస్కు కనిపెట్టిన మందుకు డీజీసీఐ అత్యవసర అనుమతి జారీ చేసింది.
కరోనా మహమ్మారిని (Corona Virus) అంతం చేసేందుకు నిరంతరం పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే డీఆర్డీవో(DRDO), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్(Dr Reddys Labs) సంయుక్తంగా ఢిల్లీలోని ఐఎన్ఎంఏఎస్ ల్యాబ్లో యాంటీ కరోనా డ్రగ్ను అభివృద్ధి చేశాయి.ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎల్లైడ్ సైన్సెస్ ల్యాబొరేటరీలో తయారైన ఈ మందు క్లినికల్ ట్రయల్స్ (Clinical trials) ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఫలితాలు అద్భుతంగా ఉండటంతో అత్యవసర ఉపయోగం కోసం యాంటీ కోవిడ్ 2 డియోక్సీ డి గ్లూకోజ్( Covid 2 Deoxy De Glucose) మందుకు డీజీసీఐ అనుమతి ఇచ్చింది. కోవిడ్ తీవ్రంగా ఉన్న రోగులకు ఈ మందు అమోఘంగా పనిచేస్తోందని..వేగంగా కోలుకోవడంతో పాటు ఆక్సిజన్పై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని డీఆర్డీవో తెలిపింది.
ఈ మందు గ్లూకోజ్ రూపంలో ఉంటుంది. దేశంలో దీన్ని సులభంగా ఉత్పత్తి చేయడంతో పాటు విరివిగా అందుబాటులో తీసుకురావచ్చని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్(Dr Reddys labs) చెబుతోంది. ఈ మందు సాచెట్లలో పొడిరూపంలో లభించనుంది. నీటిలో కరిగించి నోటితో తీసుకోవాలి. వైరస్ వ్యాపించిన భాగాల్లో చేరి అక్కడి సెల్స్లో ఉన్న కరోనా శక్తిని అడ్డుకోవడంతో పాటు విస్తరణను గణనీయంగా తగ్గిస్తుంది. ఐఎన్ఎంఏఎస్ - డీఆర్డీవో శాస్త్రవేత్తలు సీసీఎంబీ (CCMB)సహాయంతో చేసిన ప్రయోగాల్లో వైరస్కు వ్యతిరేకంగా ఈ మందు సమర్ధవంతంగా పని చేస్తున్నట్టు తేలింది. 2020 డిసెంబర్-2021 మార్చ్ మధ్య కాలంలో 220 మంది రోగులపై మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ముఖ్యంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్లకు చెందిన 27 కోవిడ్ ఆసుపత్రుల్లో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఈ ఫలితాల ఆధారంగా డీజీసీఐ (DGCI) అనుమతిచ్చింది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్