ఏపీ కరోనా అప్డేట్

- May 09, 2021 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది.24 గంటల వ్యవధిలో 1,05,494 నమూనాలను పరీక్షించగా 22,164 పాజిటివ్‌ కేసులు.. 92 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్‌ తెలిపారు.దీంతో కరోనా కేసుల సంఖ్య 12,87,603కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 8,707 మంది మృతి చెందారు.కరోనా నుంచి 10,88,264 మంది కోలుకోగా..1,90,630 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.రాష్ట్రంలో 23,259 ఆక్సిజన్‌ బెడ్లు ఉంటే 22,265 నిండినట్లు అనిల్‌ సింఘాల్‌ తెలిపారు.590 టన్నుల ఆక్సిజన్ వరకు కేంద్రం కోటా కేటాయించిందని,ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు  తీసుకుంటున్నామని వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com