వాట్సాప్లో సరికొత్త ఫీచర్..
- May 09, 2021
వాట్సాప్ అంటే తెలియని వారే ఉండరు.చిన్న వాళ్ల దగ్గరి నుంచి పెద్దవారి దాకా అంతా ఇప్పుడు దీన్నే ఎక్కువగా వాడుతుంటారు.ఫేస్బుక్ తర్వాత అత్యంత వేగంగా ఎక్కువ మంది వాడుతున్న యాప్ కూడా ఇదే.దీనిలో ఉన్న ఫీచర్లు అందరినీ త్వరగా కనెక్ట్ చేసింది.టెక్ట్స్ మెసేజ్,వాయిస్ మెసేజ్,ఫొటోలు,వీడియోలు, స్టేటస్, వాయిస్ కాల్, వాట్సాప్ వీడియో కాల్ లాంటి వాటితో పాటు.. మీమ్స్ ఉండటం దీనికి బాగా కలిసొచ్చింది.
ఇక ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది వాట్సాప్. మొన్నటికి మొన్న వాయిస్ మెసేజ్ను కరెక్ట్ చేసుకునే ఫీచర్ను తీసుకొస్తున్నట్టు చెప్పింది వాట్సాప్. అంటే మనం వాయిస్ మెసేజ్ రికార్డు చేసి సెండ్ చేసేముందు అది సరిగ్గా ఉందో లేదో వినే ఆప్షన్ అన్నమాట.దీన్ని తర్వలోనే తీసుకొస్తోంది.
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఫీచర్ తీసుకొస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది.ఇప్పటి వరకు మన మెసేజ్లకు సరిపడా స్టిక్కర్లను మనమే వెతుక్కోవాల్సి వచ్చేది.కానీ ఇకనుంచి మనం ఏదైనా మెసేజ్ టైప్ చేస్తే దానికి సరిపడా స్టిక్కర్ను ఇక నుంచి వాట్సాప్ సజెస్ట్ చేయనుంది. ఎమోషనల్, స్మైల్, బ్యూటిఫుల్ రెస్పెక్ట్ ఇలాంటి స్టిక్కర్లను ఆటోమేటిగ్గా చూపిస్తుందన్నమాట. కానీ దీనికి కొద్ది రోజుల టైమ్ పట్టనున్నట్టు ప్రకటించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









