కరోనాతో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి !
- May 11, 2021
ఏపీ-చత్తీస్ ఘడ్ సరిహద్దులో మావోయిస్టులను కరోనా మహమ్మారి వణికిస్తుంది. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన గాలికొండ దళం,BKEG దళం, DVC దళం ఏరియా కమిటీ సభ్యులకు కరోనా సోకింది. నిఘా వర్గాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దళంలోని సభ్యులు కరోనాతో పాటు దగ్గు, ఒళ్లునొప్పులు, జలుబు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మావోయిస్టులు జనజీవన స్రవంతి లోకి వస్తే ప్రభుత్వం తరఫున ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. మావోయిస్టు అగ్ర నేతలు తమ మొండితనంతో దళ సభ్యులను నిర్బంధంలో ఉంచి వారి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని సూచించారు. మావోయిస్టు సరైనా నిర్ణయం తీసుకుని పోలీసులను ఆశ్రయిస్తే పునరావాసం కలిపించి ట్రీట్మెంట్ అందిస్తామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









