ఐఎస్ఓ ట్యాంకులతో కువైట్ చేరుకున్న భారత వైమానిక దళ విమానం

- May 15, 2021 , by Maagulf
ఐఎస్ఓ ట్యాంకులతో కువైట్ చేరుకున్న భారత వైమానిక దళ విమానం

కువైట్: భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్76 విమానం, ఖాళీ ఐఎస్ఓ ట్యాంకులతో కువైట్ చేరుకుంది. ఆ ట్యాంకుల్ని నింపి, జల మార్గంలో భారతదేశానికి తరలిస్తారు. భారతదేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా వున్న నేపథ్యంలో కువైట్, భారతదేశానికి అవసరమైన మెడికల్ సామాగ్రిని పంపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు యుద్ధ నౌకల ద్వారా ఆక్సిజన్ తరలింపు చేపట్టారు. ప్రధానంగా లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ పెద్దయెత్తున కువైట్ నుంచి భారతదేశానికి సప్లయ్ అవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com