కోవిడ్ నిబంధనల ఉల్లంఘనులపై నిఘా..క్షేత్రస్థాయిలో తనిఖీలు
- May 16, 2021
జెడ్డా: కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు అమలులో ఉన్న కోవిడ్ నిబంధనలను ప్రజలు ఖచ్చితంగా పాటించి తీరాలని జెడ్డా మున్సిపాలిటీ అధికారులు కోరారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిని గుర్తించేందుకు సౌదీ అధికారుల సమన్వయంతో తనిఖీలను ముమ్మరం చేసినట్లు ప్రకటించింది. ఈద్ అల్ ఫితర్ తొలి రోజున వాటర్ ఫ్రంట్ ప్రాంతాల్లో అధికార బృందాలు క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించింది. మొత్తం 180 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించగా 9 చోట్ల 69 ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని వివరించారు. మహమ్మారి విస్తృతిని నిలువరించేందుకు ప్రజలు తమ వంతు బాధ్యతగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 940 ద్వారాగానీ, Balady యాప్ ద్వారాగానీ తమకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!









