కోవిడ్ పీసీఆర్ టెస్టు ఛార్జీలు 20 దినార్లకు తగ్గింపు
- May 18, 2021కువైట్ సిటీ: కోవిడ్ వైరస్ నిర్ధారణకు నిర్వహించే ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ఛార్జీలను సవరించింది కువైట్ ప్రభుత్వం. పీసీఆర్ టెస్ట్ ఛార్జీలను 20 దినార్లకు తగ్గించింది. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఉత్తర్వ్యులు జారీ చేశారు. ప్రస్తుతం కువైట్లో పీసీఆర్ టెస్టుకుగాను 24 నుంచి 26 దినార్ల వరకు ఛార్జ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే..ఇక నుంచి పీసీఆర్ టెస్ట్ కు 20 దినార్లకు మించి ఛార్జ్ చేయోద్దని తాజా ఉత్తర్య్వుల్లో ఆదేశించారు. మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన అన్ని లాబరేటరీలకు సవరణ ఛార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా, దేశీయంగా పీసీఆర్ టెస్టు ఛార్జీల మధ్య వ్యత్యసాన్ని సమీక్షించిన తర్వాతే తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శాఖ వివరించింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్