కేసులు తగ్గినా మరింత అప్రమత్తం అవసరం: ప్రధాని మోదీ

- May 20, 2021 , by Maagulf
కేసులు తగ్గినా మరింత అప్రమత్తం అవసరం: ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ప్రధాని మోదీ వెల్లడించారు.కోవిడ్ కట్టడిపై క్షేత్ర స్థాయిలో జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులతో ప్రధాని మోదీ రెండో విడత గురువారం సమావేశమయ్యారు. గతంతో పోల్చితే ఇన్ఫెక్షన్ కొంచం మిగిలి ఉందని ఇపుడు అదే మన ముందు ఉన్న సవాలు పూర్తిగా తొలగనట్టేనని ప్రధాని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అందరిపై మరింత బాధ్యత, సవాళ్లు పెరిగాయని మోదీ అన్నారు. ఈ సవాళ్ల మధ్య మనం కొత్త వ్యూహాలు, పరిష్కారాలతో ముందగుడు వేయాలని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com