తెలంగాణ కరోనా అప్డేట్
- May 20, 2021
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,660 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.మరో 23 మంది కరోనాబారినపడి మృతిచెందగా.. ఇదే సమయంలో 4,826 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 5,44,263కు పెరగగా.. రికవరీలు 4,95,446గా చేరాయి.ఇక, ఇప్పటి వరకు 3,060 మంది మృతి చెందగా.. ప్రస్తుతం 45,757 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.రివకరీ రేటు రాష్ట్రంలో 91.03 శాతానికి పెరిగిందని తెలియజేశారు.. ఇక, గత 24 గంటల్లో 69,252 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.అత్యధికంగా జీహెచ్ంఎసీ పరిధిలో 574 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 218, ఖమ్మంలో 217, నల్గొండలో 166 కేసులు వెలుగు చూశాయి.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







