నిషేధం ఎత్తివేత తర్వాత 36 గంటల్లో 18,680 మంది పౌరుల విదేశీ ప్రయాణం
- May 21, 2021
సౌదీ: అంతర్జాతీయ ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం ఎత్తివేసిన తర్వాత ఒక్కసారిగా కింగ్డమ్ నుంచి విదేశీ ప్రయాణాలు భారీగా నమోదయ్యాయి. భూ సరిహద్దులు, విమానాశ్రయాల ద్వారా నిషేధం ఎత్తివేసిన తొలి 36 గంటల్లోనే 18,680 మంది సౌదీ పౌరులు విదేశాలకు వెళ్లినట్లు కింగ్డమ్ అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో తొలి 24 గంటల్లో 10,450 మంది ప్రయాణించారని తెలిపారు. విమానాల్లో విదేశాలకు వెళ్లిన వారిలో ఎక్కువ మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లారని, ఆ తర్వాత ఈజిప్ట్, ఖతార్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ ఉన్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. 5,717 మంది పౌరులు భూ సరిహద్దుల మీదుగా పొరుగు దేశాలకు వెళ్లారని వెల్లడించారు. మొత్తం 3,362 మంది కింగ్ ఫహద్ కాజ్వేను బహ్రెయిన్కు వెళ్లడానికి ఉపయోగించగా, 689 మంది అల్-బాతా సరిహద్దు క్రాసింగ్ ద్వారా యుఎఇకి బయలుదేరినట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. అలాగే 673 మంది సౌదీలు అల్-హదీతా చెక్ పాయింట్ గుండా జోర్డాన్ చేరుకోగా, 324 మంది ఖతార్ సాల్వా చెక్ పాయింట్ దాటి బయలుదేరారు, 270 మంది ఖాఫ్జీ సరిహద్దు క్రాసింగ్ ద్వారా కువైట్ వెళ్లినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







