భారత్ కరోనా అప్డేట్

- May 24, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్ లో కొనసాగుతున్నసెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. వరుసగా 8వ రోజు 3 లక్షల లోపు రోజువారి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అయితే.. పాజిటివ్ కేసులు తగ్గినా…. కరోనా మరణాలు మాత్రం ఆగడం లేదు. తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్త‌గా 2,22,315 క‌రోనా కేసులు న‌మోదయ్యాయి. దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,67,52,447 కి చేరింది.ఇందులో 2,37,28,011 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 27,20,716 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 4,454 మంది మృతి చెందారు.దీంతో దేశంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3,03,720 కి చేరింది. ఇక 24 గంటల్లో 3,02,544 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com