తెలంగాణ కరోనా అప్డేట్

- May 25, 2021 , by Maagulf
తెలంగాణ కరోనా అప్డేట్

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 81,203 నమూనాలను పరీక్షించగా 3,821 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన  కరోనా కేసుల సంఖ్య 5,60,141కి చేరింది. తాజాగా మరో 23 మంది మహమ్మారికి బలవ్వగా.. మొత్తం మృతుల సంఖ్య 3,169కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 38,706 క్రియాశీల కేసులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ఇవాళ 4,298 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్ఛార్జి అయినట్లు పేర్కొంది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో 537 మందికి పాజిటివ్‌గా తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com