భారత ప్రభుత్వం పై వాట్సాప్ కేసు
- May 26, 2021
న్యూ ఢిల్లీ: సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ పై నియంత్రణకోసం కొత్త నిబందనలను కేంద్రప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది.ఈ కొత్త నిబందనలు ఈరోజు నుంచి అమలులోకి వచ్చాయి.కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన కొత్త ఐటి నిబందనలు యూజర్ల గోప్యతకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, వెంటనే కేంద్రం తీసుకొచ్చిన నిబందలను అడ్డుకోవాలని కోరుతూ వాట్సాప్ డిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.దేశ భద్రతకు లేదా ప్రజలకు హాని కలిగించే విధంగా ఏవైనా పోస్టులను పెడితే ఆ వివరాలను ప్రభుత్వానికి తెలియజేసేలా కొత్త నిబందనలు తీసుకొచ్చారు.భారత రాజ్యాంగం ప్రకారం ఇది వ్యక్తుల గోప్యతకు భంగం కలిగించినట్టే అవుతుందని వాట్సాప్ అంటోంది.వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సందేశాలు ఉన్నాయని, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలను ఫాలో అయితే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సందేశాలను పక్కన పెట్టాల్సి వస్తుందని, వెంటనే కేంద్రం తీసుకోచ్చిన కొత్త ఐటీ నిబంధనలను అడ్డుకోవాలని ఢిల్లీ హైకోర్టును కోరింది వాట్సాప్.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







