కువైట్ టవర్స్ పై త్రివర్ణ పతాకం..
- May 27, 2021
కువైట్ సిటీ: కోవిడ్ సెకండ్ వేవ్ తో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న భారత్ కు బాసటగా మరోసారి తమ స్నేహశీలతను చాటుకుంది కువైట్. కోవిడ్ మహమ్మారి సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొని కోసం తిరిగి సాధారణ పరిస్థికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ కువైట్ టవర్స్ పై విద్యుత్ కాంతులతో భారత్ జాతీయ జెండాను ప్రదర్శించింది. దేశ చరిత్రలో కువైట్ టవర్స్ పై త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించటం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. కువైట్-భారత్ మధ్య మైత్రి బంధం చాటిచెప్పేలా కువైట్ టవర్స్ పై ఏర్పాటు చేసిన నేషనల్ ఫ్లాగ్ లైటింగ్ ను కువైట్ లోని భారత రాయబార కార్యాలయం తమ అధికారిక ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఇదిలావుంటే..సెకండ్ వేవ్ ఉద్ధృతం అవగానే భారత్ కు సాయం ప్రకటించిన తొలి దేశం కూడా కువైట్ కావటం విశేషం.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







