కువైట్ టవర్స్ పై త్రివర్ణ పతాకం..

- May 27, 2021 , by Maagulf
కువైట్ టవర్స్ పై త్రివర్ణ పతాకం..

కువైట్ సిటీ: కోవిడ్ సెకండ్ వేవ్ తో సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న భారత్ కు బాసటగా మరోసారి తమ స్నేహశీలతను చాటుకుంది కువైట్. కోవిడ్ మహమ్మారి సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొని కోసం తిరిగి సాధారణ పరిస్థికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ కువైట్ టవర్స్ పై విద్యుత్ కాంతులతో భారత్ జాతీయ జెండాను ప్రదర్శించింది. దేశ చరిత్రలో కువైట్ టవర్స్ పై త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించటం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. కువైట్-భారత్ మధ్య మైత్రి బంధం చాటిచెప్పేలా కువైట్ టవర్స్ పై ఏర్పాటు చేసిన నేషనల్ ఫ్లాగ్ లైటింగ్ ను కువైట్ లోని భారత రాయబార కార్యాలయం తమ అధికారిక ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ఇదిలావుంటే..సెకండ్ వేవ్ ఉద్ధృతం అవగానే భారత్ కు సాయం ప్రకటించిన తొలి దేశం కూడా కువైట్ కావటం విశేషం.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com