ప్రవాసీ కార్మికుల వర్క్ పర్మిట్ల ఫీజుల్లో మార్పులు..జూన్ 1 నుంచి అమలు
- May 28, 2021
మస్కట్: ఒమనైజేషన్ లో భాగంగా ప్రైవేట్ రంగంలో స్థానికులకు ఎక్కువ ఉపాధి కల్పించే లక్ష్యంగా ఒమన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమలు చేయబోతోంది. ప్రైవేట్ రంగంలోని ప్రవాస కార్మికులకు ఇచ్చే వర్క్ పర్మిట్ల ఫీజులను సవరణలు చేసింది. ఈ మార్పులు జూన్ 1 నుంచే అమలులోకి రానున్నాయి. వర్క్ పర్మిట్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నా ఫీజు చెల్లించని వాళ్లందరికి ఈ నిబంధన వర్తిస్తుంది. దీంతో ప్రైవేట్ రంగంలోని ఎగువ, మధ్య శ్రేణి వర్క్ ఫోర్స్ తో పాటు సాంకేతిక రంగం, ఇతర నిపుణత కలిగిన రంగాల్లోని ప్రవాసీ ఉద్యోగుల వర్క్ పర్మిట్ల ఫీజులు మారనున్నాయి. ఈ మార్పుల కారణంగా వర్క్ పర్మిట్ల సంఖ్య తగ్గి స్థానికులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







