'ICBF' ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

- May 29, 2021 , by Maagulf
\'ICBF\' ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

దోహా: దోహాలో ICBF(ఇండియన్ కమ్యూనిటీ బెనివోలెన్ట్ ఫోరమ్) సంస్థ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో TGS సభ్యులు కూడా పాల్గొని విజయవంతం చేశారు.శుక్రవారం ఉదయం 8 గంటలకు హమ్మద్ బ్లడ్ డోనేషన్ సెంటర్ లో శిబిరాన్ని భారత రాయబారి దీపక్ మిట్టల్ ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి భారత రాయబార కార్యాలయం రెండవ ప్రధాన కార్యదర్శి ఫేహిం,జాయిద్ హుస్మాన్(ఐసీబీఫ్ అధ్యక్షుడు), బాబురాజన్(ఐసీసీ అధ్యక్షులు), అజిమ్ అబ్బాస్(ఐబీపీసీ అధ్యక్షుడు) మరియు కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి సభ్యలు శంకర్ గౌడ్, ప్రేమకుమార్ బొడ్డు, మహేందర్ చింత కుంట,ఎల్లయ్య తల్లాపెళ్లి, కింగ్ రాజు ,శ్రీధర్ అబ్బాగౌని,గడ్డి రాజు,రాజేష్ ,శోభన్ బంధారపు,వెంకట్ గౌడ్,రాజేశ్వర్ గౌడ్ పాల్గొని విజయవంతం చేశారు.తెలంగాణ గల్ఫ్ సమితి పిలుపు మేరకు అధిక సంఖ్యలో వచ్చి రక్తదానం చేసిన సభ్యలందరికి ధన్యవాదాలు తెలిపారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com