కరోనా పేషెంట్స్ అటెండర్లకు ఉచితంగా భోజనం..
- May 29, 2021
హైదరాబాద్: కరోనా రోగులు ఆస్పత్రుల్లో ఉంటే..వారికి ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియక..వారి అటెండర్లు పడిగాపులు పడాల్సిన పరిస్థితి..కరోనా పేంషట్ల పరిస్థితి ఎలా ఉన్నా..వారి అటెండర్ల పరిస్థితి దారుణంగా తయారైంది.ఆహారానికి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొనగా.. దానికి తోడు లాక్డౌన్ వారి కష్టాలను రెట్టింపు చేసింది.అయితే, ఇంత కాలం కోవిడ్ రోగులకు ఇంటి వద్దకే వెళ్లి భోజనం అందిస్తూ వస్తున్న వేదం ఫౌండేషన్..ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి..కరోనా రోగుల అటెండర్లకు కూడా ఉచితంగా భోజనం అందింస్తోంది.ప్రస్తుతం గాంధీ, నిమ్స్, టిమ్స్, నీలోఫర్ వంటి ఆస్పత్రులు దగ్గర కోవిడ్ రోగుల అటెండర్లకు మా సేవలను విస్తరిస్తున్నామని..ఈ ఆస్పత్రుల వెలుపల వందలాది మంది అటెండర్లు ఉన్నారు, వారు వివిధ గ్రామాల నుండి వచ్చినవారు..వారు రోజూ పూర్తిస్థాయిలో భోజనం తినలేని పరిస్థితి..ఇది గమనించి…మేం వేదం ఫౌండేషన్ ద్వారా ఉచితంగా భోజనం ప్యాకెట్లను అందిస్తామని తెలిపారు అలిశెట్టి అరవింద్.అవసరం ఉన్నవాళ్లు +91 9985588821, +91 9985588831, +91 9985588841 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!







