6.3 మిలియన్ ఎఇడి విలువైన కార్ల స్మగ్లింగ్: గ్యాంగ్ అరెస్ట్

- June 03, 2021 , by Maagulf
6.3 మిలియన్ ఎఇడి విలువైన కార్ల స్మగ్లింగ్: గ్యాంగ్ అరెస్ట్

యూఏఈ: 6.3 మిలియన్ దిర్హాముల విలువైన కార్లను స్మగ్లింగ్ చేసిన కేసులో ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. మొత్తం ఆరుగురు సభ్యులు గల ఈ గ్యాంగులో అరబ్ జాతీయులతోపాటు, ఆసియా జాతీయులు వున్నారు. కాగా, ఈ కేసులో 19 మందికి ఊరట లభించింది. కార్లను దొంగిలించి, యూఏఈ వెలుపల నిందితులు వీటిని విక్రయించినట్లు విచారణలో తేలింది. మొత్తం 28 వాహనాల్ని దొంగిలించి, మరో అరబ్ దేశానికి స్మగుల్ చేశారు. కంటెయినర్లలో కార్లను తరలించిన నిందితులు, కంటెయినర్లలో వున్నది హోమ్ అప్లయెన్సెస్ అని సంబంధిత అధికార వర్గాలకు చెప్పడం గమనార్హం. 17 వాహనాల్ని అధికారులు సీజ్ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com