మనసే సాక్షి
- June 02, 2015
వయసు మీద పడుతున్నకొద్దీ
మనిషికి మృత్యు భయం
మొదలవుతుంది
చుట్టూ ప్రకృతి ఉన్నా
మనిషి దాని నుండి
పాఠాలు నేర్చుకోడు
తెల్లని మబ్బు
నల్లగా మారి
బరువెక్కి వర్షించి
తేట పడుతుంది
తన ధర్మాన్ని
తాను నేరవేర్చానని
సంతృప్తి పడుతుంది
చెట్టు మొక్కగా
మొదలై
మహా వృక్షంగా
శాఖోపశాఖాలుగా
విస్తరిస్తుంది
తొలిరోజుల్లో
నీటికోసం ఆర్తి చెందినా
బలాన్ని పుంజుకున్నాక
గాలి వేగాన్ని
జడి వానల్నీ
తట్టుకుంటుంది
చేతనైనంత మేరకు
ప్రపంచానికి
సేవ చేస్తుంది
కాయలనూ
పండ్లనూ
విరగకాసి
అడగకుండానే
ఇస్తుంది
రాళ్ళు విసిరిన
చేతులకు కూడా
గాయపడిన
ఫలాలని అందిస్తుంది
ఒంటిని వలిచి
బెరడును ఇస్తుంది
కొమ్మలపై
పిల్లలకూ పక్షులకూ
సేద చేకూరుస్తుంది
వయసు మళ్ళాక
శక్తి ఉడిగాక
ఖరీదైన కలపగా
జీవితాన్ని
సార్ధకం చేసుకుంటుంది
మనిషి మాత్రం
తన కోసమే
బ్రతుకుతాడు
'తన' వలయంలోనే
తనువు చాలిస్తాడు
దీర్ఘ నిద్ర
మాట సరే!
ప్రతిరాత్రీ
నిదురిస్తాడుకదా!
తానెవరికైనా
ఆ రోజున మంచి చేశాడా?
అలా అని ఆలోచించాడా?
ప్రకృతి ధర్మమైన
వార్ధక్యాన్ని మృత్యువునీ
ఎందుకు నిరసిస్తాడు?
భగవంతుడిని
పూజించాడో లేదో!
వదిలేద్దాం!
ఆఖరి క్షణాలలోనైనా
సాటి మనిషికి
సాయం పడితే
ఆ ఆఖరి క్షణాలు
అతన్ని గురించి
మంచి జ్ఞాపకాలుగా
మిగిలిపోతాయికదా!
--- డా|| మాదిరాజు రామలింగేశ్వర రావు, మచిలీపట్నం.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









