కోవిడ్ పేషంట్లకు 'ఆటా' బాసట: సీపీ వీసీ సజ్జనార్
- June 09, 2021
హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మనముందున్న కోవిడ్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మనం ఎంతో మంది కావలసిన వారిని ఆప్తులను కోల్పోతున్నా వార్తలు విన్న భువనేశ్వర్ భుజాల ఆటా అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కాన్ సన్ట్రేటర్స్ ని అందించాలని నిర్ణయం తీసుకొని యుద్ధప్రాతిపదికన వీటిని సమకూర్చుకొని మన రాష్ట్రానికి పంపించడం జరిగింది. ఈ రోజు వీటిని ఇండియా ఆటా టీమ్ ద్వారా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ కి అందజేయడం జరిగింది.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరిస్తూ లోహిత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆక్సిజన్ అవసరం కాబట్టి ఈ ఆక్సిజన్ కాన్సెంట్రేట్ మిషన్స్ 10 మరియు 50 ఆక్సోమీటర్స్ అందజేయడం జరుగుతుందన్నారు.కోవిడ్ పేషంట్ల సహాయార్థం ఇంకా ఎటువంటి అవసరం ఉన్నా సమకూరుస్తామన్నారు.
ఈ సందర్భంగా అమెరికాలో ఉంటూ మన వాళ్ల కోసం మన వారి ఆరోగ్య అవసరాలను తీర్చేవిధంగా సహకరిస్తున్న అందర్నీ ప్రత్యేకంగా కమీషనర్ గారు అభినందించారు.ఈ కార్యక్రమములో హనుమంతరావు అసిస్టెంట్ కమిషనర్, ABR tv CEO శ్రీనివాస్ బండారి మరియు రామకృష్ణ మాశెట్టి సంఘ సేవకులు, సీపీ పీ.ఏ శ్రీధర్ పాల్గొన్నారు .
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







