జెడ్డాలో కొత్త వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభం
- June 11, 2021సౌదీ: వ్యాక్సినేషన్ను మరింత ముమ్మరం చేసేందుకు సౌదీ ప్రభుత్వం కొత్తగా మరో వ్యాక్సినేషన్ సెంటర్ను ప్రారంభించింది. జెడ్డాలోని ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్-ఫైసల్ స్టేడియంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ సెంటర్ ను సౌదీ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తవ్ఫిక్ అల్-రబియా ప్రారంభించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు జనం భారీ సంఖ్యలో ముందుకు వస్తున్నారని, వ్యాక్సిన్ కోసం సెహతీ యాప్లో పేర్లు నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య పెరగడంతో కొత్త సెంటర్ ను ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు. జెడ్డా వ్యాక్సినేషన్ సెంటర్ ను స్పెషలిస్ట్ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోజుకు 15,000 మందికి వ్యాక్సిన్ అందించేలా ఇందులో 60 క్లినిక్లు ఉన్నాయి. ఇదిలాఉంటే..తన పర్యటనలో భాగంగా అల్-రబియా తూర్పు జెడ్డా జనరల్ హాస్పిటల్లోని వర్క్ఫ్లోను మంత్రి పరిశీలించారు, అక్కడ ఎమర్జెన్సీ, ఫిజియోథెరపీ వార్డులను, శ్వాసకోశ సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. జెడ్డాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఆసుపత్రిలోని జనరల్ మెడికల్ అథారిటీ, కోవిడ్ -19 వ్యాక్సిన్ సెంటర్లో కూడా మంత్రి పర్యటించారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..