పలు రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

- March 07, 2016 , by Maagulf
పలు రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

 దేశంలో ఉగ్రవాదుల కదలికలపై నిఘావర్గాల హెచ్చరికలతో కేంద్రం అప్రమత్తత ప్రకటించింది. దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ సహా ద్వితీయ శ్రేణి నగరాలైన విజయవాడ, భోపాల్‌, లఖ్‌నవూ, జయ, ఛండీగఢ్‌లో అప్రమత్తంగా ఉండాలని భద్రతా సంస్థలు హెచ్చరించాయి. గుజరాత్‌ ద్వారా కొంతమంది ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారని నిఘావర్గాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల్లో విస్తృత తనిఖీలు చేపట్టాలని, భద్రత కట్టుదిట్టం చేయాలని గుజరాత్‌ సహా పలు రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.దేశ భద్రతపై సమీక్షించేందుకు ఈరోజు దిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు, ఎన్‌ఎస్‌జీ చీఫ్‌, హోంమంత్రిత్వ శాఖ అధికారులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com