నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌: సీపీ స‌జ్జ‌నార్

- June 18, 2021 , by Maagulf
నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌: సీపీ స‌జ్జ‌నార్

హైదరాబాద్‌: నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఐదుగురిని అదుపులోకి తీసుకున్న‌ట్లు సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ వీ.సీ.స‌జ్జ‌నార్ తెలిపారు.ఈ ముఠాకు సూత్ర‌ధారి అయిన ఆదినారాయ‌ణ‌మూర్తికి తొమ్మిది రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలున్నాయ‌ని చెప్పారు. క‌న‌ప‌డిన ఖాళీ భూముల‌న్నింటికీ ప‌త్రాలు సృష్టించి వేరేవారికి అమ్మ‌డ‌మే వీరి ప్ర‌ధాన వృత్తి అని వెల్ల‌డించారు. మ‌హేశ్వ‌రంలో 40 ఎక‌రాల భూమిని కూడా ఇలాగే వేరేవారికి విక్ర‌యిస్తున్నార‌ని, కొనుగోలుదారుడు అడిగిన అస‌లు ప‌త్రాల‌ను మొబైల్లో పంపించార‌ని,వాటి పై అనుమానం వ‌చ్చిన బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించిన‌ట్లు సీపీ వివ‌రించారు.ఎక‌రానికి రూ.1.4 కోట్ల లెక్క‌న రూ.56 కోట్ల‌కు అగ్రిమెంట్ కుదుర్చుకున్నార‌ని, వీరి ద‌గ్గ‌ర నుంచి న‌కిలీ ప‌త్రాలు, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఆర్డీవో,ఎమ్మార్వో పేరుతో రెవెన్యూ స్టాంపులు,51 ప‌ట్టాదారు పాసు పుస్త‌కాలు కూడా స్వాధీనం చేసుకున్న‌ట్లు స‌జ్జ‌నార్ తెలియ‌జేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com