నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్: సీపీ సజ్జనార్
- June 18, 2021
హైదరాబాద్: నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ తెలిపారు.ఈ ముఠాకు సూత్రధారి అయిన ఆదినారాయణమూర్తికి తొమ్మిది రియల్ ఎస్టేట్ కంపెనీలున్నాయని చెప్పారు. కనపడిన ఖాళీ భూములన్నింటికీ పత్రాలు సృష్టించి వేరేవారికి అమ్మడమే వీరి ప్రధాన వృత్తి అని వెల్లడించారు. మహేశ్వరంలో 40 ఎకరాల భూమిని కూడా ఇలాగే వేరేవారికి విక్రయిస్తున్నారని, కొనుగోలుదారుడు అడిగిన అసలు పత్రాలను మొబైల్లో పంపించారని,వాటి పై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్లు సీపీ వివరించారు.ఎకరానికి రూ.1.4 కోట్ల లెక్కన రూ.56 కోట్లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని, వీరి దగ్గర నుంచి నకిలీ పత్రాలు, మహబూబ్నగర్ ఆర్డీవో,ఎమ్మార్వో పేరుతో రెవెన్యూ స్టాంపులు,51 పట్టాదారు పాసు పుస్తకాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ తెలియజేశారు.


తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









