నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్: సీపీ సజ్జనార్
- June 18, 2021
హైదరాబాద్: నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ తెలిపారు.ఈ ముఠాకు సూత్రధారి అయిన ఆదినారాయణమూర్తికి తొమ్మిది రియల్ ఎస్టేట్ కంపెనీలున్నాయని చెప్పారు. కనపడిన ఖాళీ భూములన్నింటికీ పత్రాలు సృష్టించి వేరేవారికి అమ్మడమే వీరి ప్రధాన వృత్తి అని వెల్లడించారు. మహేశ్వరంలో 40 ఎకరాల భూమిని కూడా ఇలాగే వేరేవారికి విక్రయిస్తున్నారని, కొనుగోలుదారుడు అడిగిన అసలు పత్రాలను మొబైల్లో పంపించారని,వాటి పై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్లు సీపీ వివరించారు.ఎకరానికి రూ.1.4 కోట్ల లెక్కన రూ.56 కోట్లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని, వీరి దగ్గర నుంచి నకిలీ పత్రాలు, మహబూబ్నగర్ ఆర్డీవో,ఎమ్మార్వో పేరుతో రెవెన్యూ స్టాంపులు,51 పట్టాదారు పాసు పుస్తకాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ తెలియజేశారు.


తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!









