నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్: సీపీ సజ్జనార్
- June 18, 2021
హైదరాబాద్: నకిలీ పత్రాలతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ తెలిపారు.ఈ ముఠాకు సూత్రధారి అయిన ఆదినారాయణమూర్తికి తొమ్మిది రియల్ ఎస్టేట్ కంపెనీలున్నాయని చెప్పారు. కనపడిన ఖాళీ భూములన్నింటికీ పత్రాలు సృష్టించి వేరేవారికి అమ్మడమే వీరి ప్రధాన వృత్తి అని వెల్లడించారు. మహేశ్వరంలో 40 ఎకరాల భూమిని కూడా ఇలాగే వేరేవారికి విక్రయిస్తున్నారని, కొనుగోలుదారుడు అడిగిన అసలు పత్రాలను మొబైల్లో పంపించారని,వాటి పై అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్లు సీపీ వివరించారు.ఎకరానికి రూ.1.4 కోట్ల లెక్కన రూ.56 కోట్లకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని, వీరి దగ్గర నుంచి నకిలీ పత్రాలు, మహబూబ్నగర్ ఆర్డీవో,ఎమ్మార్వో పేరుతో రెవెన్యూ స్టాంపులు,51 పట్టాదారు పాసు పుస్తకాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ తెలియజేశారు.


తాజా వార్తలు
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం







